కూటమి పాలన వేడుకలో జేసీ సంచలన వ్యాఖ్యలు..

"అధికారం మాదే"

జనం న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ కూటమిదే అధికారం అని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ జగన్ రాడు అంటూ సవాల్ చేశారు. కూటమి రెండేళ్ల పాలన విజయవంతం కార్యక్రమంలో పాల్గొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రజల మధ్యలో కూర్చుని డ్యాన్స్ చేశారు. దీంతో అభిమానులు, కార్యకర్తలు సైతం ఉర్రూతలూగారు. తెలుగుదేశం పార్టీకి నాయకులు ముఖ్యం కాదు కార్యకర్తలే ముఖ్యం అని మాజీఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. నేను తెలుగుదేశం పార్టీకి మాత్రమే కాదు చంద్రబాబు నాయుడి విజన్‌కు కూడా కార్యకర్తను అని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో కూడా కూటమిదే అధికారం అని చెప్పుకొచ్చారు. జగన్ 2029 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతాడు అని ఛాలెంజ్ చేసి మరీ చెప్పుకొచ్చారు. ప్రజలకు గొడ్డలితో పనేముంది.గొడ్డలి పార్టీ వాళ్లు ఏమి చేయలేరు. గొడ్డలికి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు అని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.అనంతపురంలో కూటమి రెండేళ్ల పాలన విజయవంతం కార్యక్రమం జరిగింది. ఈ కార్యకరమానికి 500 వాహనాలతో అభిమానులు…తెలుగు తమ్ముళ్లతో కలిసి వేదిక వద్దకు వచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి సందడి చేశారు. సభా ప్రాంగణంలోకి జేసీ ప్రభాకర్ రెడ్డి అడుగు పెట్టగానే ఆ ప్రాంతం అంతా ఈలలు కేకలతో మారుమోగింది.సభా ప్రాంగణంలో కార్యకర్తల మధ్య కూర్చోని తనదైన స్టైల్‌లో డ్యాన్స్ చేస్తు కార్యకర్తల్లో జోష్ నింపారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి అంటూ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మళ్లీ అధికారం కూటమిదే అనంతపురంలో జరిగిన కూటమి రెండేళ్ల పాలన విజయవంతం కార్యక్రమంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ కూటమి అధికారంలోకి రావడం ఖాయం అని చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ మళ్లీ అధికారంలోకి రావడం కల్లేనని చెప్పుకొచ్చారు. కూటమి పార్టీ నాయకులు అంతా కలిసిమెలిసి ప్రజాభిమానం చూరగొనాలని పిలుపునిచ్చారు. దయచేసి ఎక్కడైన పొరపాటు జరిగితే స్టేజ్ మీద ఉన్న నాయకులు బాధ్యత తీసుకోవాలి అని సూచించారు. నాయకులు పార్టీ మారతారేమెమో కానీ కార్యకర్తలు మాత్రం కాదు అని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. నన్ను మున్సిపల్ చైర్మన్ చేసింది కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పసుపు సైనికులు అని కొనియాడారు.ఇక్కడున్న కార్యకర్తలు పసుపు రంగు వేసుకున్నారు… మనం వద్దన్న పార్టీ కార్యకర్తలు మనకు ఓట్లు వేస్తారు అంటూ చెప్పుకొచ్చారు. ‘నేను జైల్లో ఉన్నప్పుడు నన్ను మున్సిపల్ చైర్మన్‌గా గెలిపించింది ఈ కార్యకర్తలే. మళ్ళీ మనం అధికారంలోకి రావాలంటే అందరి మీద ఆధారపడిండి. వైసీపీ హాయంలో ఘోరాలు జరిగాయి…ఎన్నికల్లో నామినేషన్లు కూడా వేయనివ్వలేదు. స్థానిక సంస్థల ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలి అని మాజీమంత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్‌తోపాటు కూటమి పార్టీల ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *