అక్షర ఆయుధం : మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన 15 ఏళ్ల నాటి లాకప్ డెత్ కేసులో వాషిమ్ జిల్లా సెషన్స్ కోర్టు సంచలనాత్మక తీర్పు వెల్లడించింది. 23 ఏళ్ల గిరిజన యువకుడి మృతికి కారణమైన నాటి రిసోద్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్తో పాటు మొత్తం 9 మంది పోలీసులకు కోర్టు జీవిత ఖైదు విధించింది. అంతేకాదు ఒక్కొక్కరికీ రూ.50వేలు జరిమానా విధించింది. ఈ కేసుపై ఏళ్ళ తరబడి పోరాటం చేశామని ఇప్పుడు తమకు న్యాయం జరిగిందని బాధితుడి తల్లి చెప్తోంది. తండ్రీకొడుకుల లాకప్ డెత్ కేసులో తమిళనాడులోని మదురై కోర్టు 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఆ సంచలన తీర్పుపై ఇంకా చర్చ జరుగుతున్న తరుణంలో మరో లాకప్ డెత్ కేసులో కోర్టు 9 మంది పోలీసులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2011 నాటి సంచలనాత్మక లాకప్ డెత్ కేసులో మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లా సెషన్స్ కోర్టు స్టేషన్ ఇన్ఛార్జ్తో సహా 9 మంది పోలీసులకు జీవితఖైదు విధించింది. విచారణ పేరుతో పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి గిరిజన యువకుడిని చిత్రహింసలు పెట్టి చంపిన కేసులో 15 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత ఈ తీర్పు వెలువడింది. 9 మంది పోలీసులకు జీవిత ఖైదుమహారాష్ట్రలోని వాసిమ్ జిల్లా సెషన్స్ కోర్టు చారిత్రక తీర్పు ఇచ్చింది.పోలీస్ కస్టడీ మరణం కేసులో 9 మంది పోలీసులకు జీవిత ఖైదు విధించింది. సుమారు 15 ఏళ్ల క్రితం పోలీస్ స్టేషన్లో విచారణ పేరుతో ఒక గిరిజన యువకుడిని పోలీసులు తీసుకువచ్చారు. కస్టడీలో చిత్రహింసలకు గురి చేయగా అతడు చనిపోయాడు. అప్పటి పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ (థానేదార్) సహా తొమ్మిది మంది పోలీసులకు కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఈ తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.అసలేం జరిగింది?2011 మే 10వ తేదీ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మహారాష్ట్రలోని రిసోద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం కేసు నమోదు అయ్యింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా రిసోద్ పోలీసులు’పార్ధి’ (గిరిజన తెగ) వర్గానికి చెందిన 23 ఏళ్ల యువకుడు బెగ్యా నైను పవార్ను దొంగతనం అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.