సాక్షి డిజిటల్ న్యూస్: అయోధ్య రామమందిరం విరాళాల మిస్సింగ్ ఆరోపణల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఉత్తరప్రదేశ్ పోలీసులు… 8 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అయోధ్య రామమందిరం విరాళాల మిస్సింగ్ ఆరోపణల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అయితే ఇందుకు సంబంధించి విచారణ జరుపుతున్న ఉత్తరప్రదేశ్ పోలీసులు… ఎఫ్ఐఆర్ నమోదు చేసి, 8 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం అసలైన దొంగలు వదిలేసి… ఈ వివాదం నుంచి దృష్టి మళ్లించేందుకు సంబంధం లేని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత సంజయ్ సింగ్ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… అయోధ్య రామమందిరంకు సంబంధించిన నిధుల దుర్వినియోగమయ్యానే ఆరోపణలు రావడం రాజకీయాంగా తీవ్ర కలకలం రేపుతోంది. భక్తులు విరాళంగా ఇచ్చిన నగదు, బంగారం, ఆభరణాలలో కొంత అదృశ్యమయ్యాయని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తీవ్రంగా ఖండించాయి. మరోవైపు ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపేందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్… స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేశారు. సిట్ ఇప్పటికే తన ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అయితే తాజాగా సిట్ సమర్పించిన ప్రాథమిక నివేదిక, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు కృష్ణ మోహన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఉత్తరప్రదేశ్ పోలీసులు తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత కొన్ని గంటల్లో ఈ ఘటనలో నిందితులుగా భావిస్తున్న మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్న పోలీసులు… అనంతరం చట్టపరమైన ప్రక్రియను అనుసరించి, న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నారు. ఇక, ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ఎనిమిది మంది వ్యక్తులలో రామశంకర్ యాదవ్ తిన్ను, అనుకల్ప్ మిశ్రా, అవినాష్ శుక్లా, కరుణేష్ పాండే, లవ్కుష్ మిశ్రా, రామశంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ, మనీష్ యాదవ్లు ఉన్నారు. వీరందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 305, 306, 316(5), 317(4), 317(5), 61 3(5), అలాగే అవినీతి నిరోధక చట్టం (Prevention of Corruption Act)లోని సెక్షన్ 13(1)(a) కింద అభియోగాలను ఎదుర్కొంటున్నారు.