జనం న్యూస్ : కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో బీటెక్ విద్యలో ఏఐ, డేటా సైన్స్లో కోర్సుకు ఏఐసీటీఈ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో బీటెక్ విద్యలో ఏఐ, డేటా సైన్స్లో కోర్సుకు ఏఐసీటీఈ ఆమోదం తెలిపింది. తద్వారా ఈ ఘనత సాధించిన దేశంలోనే తొలి సంస్కృత యూనివర్సిటీగా కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం నిలిచింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఏఐసీటీఈ ఆమోదిత బీటెక్ కోర్సును ప్రారంభించింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఈ కోర్సులో ప్రవేశాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ‘‘కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఒక సంస్కృత విశ్వవిద్యాలయం ద్వారా భారతదేశపు మొట్టమొదటి ఏఐసీటీఈ-ఆమోదం పొందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్లో బీటెక్ కోర్సును ప్రారంభించింది’’ అని కేంద్ర విద్యా శాఖ పేర్కొంది. ఇది ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి అత్యాధునిక సాంకేతికతలను భారతదేశపు గొప్ప భాషా వారసత్వం, జ్ఞాన వ్యవస్థలతో మేళవించి… భారతీయ భాషలలో నూతన ఆవిష్కరణలకు, ప్రాచీన తాళపత్రాల డిజిటలైజేషన్కు, అంతర్విభాగ పరిశోధనలకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని కేంద్ర విద్యా శాఖ తెలిపింది. ఉన్నత విద్యా సంస్థలను బహుళవిభాగ అభ్యాస కేంద్రాలుగా మార్చాలనే ఎన్ఈపీ 2020 దార్శనికతను ఇది ప్రతిబింబిస్తుందని పేర్కొంది. ‘‘ఢిల్లీలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ వంటి ఆధునిక రంగాలలో బీటెక్ కోర్సును ప్రారంభించడం ఒక దూరదృష్టితో కూడిన ముందడుగు. ఈ చొరవ భారతదేశపు ప్రాచీన జ్ఞాన సంప్రదాయం, నూతన సాంకేతికతల కలయికను బలోపేతం చేస్తుంది. ఇది భారతీయ భాషల కోసం నూతన ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి, అలాగే ప్రాచీన గ్రంథాలు, తాళపత్రాలను పరిరక్షించడానికి ఒక కొత్త దిశను అందిస్తుంది. సంప్రదాయం, సాంకేతికతల ఈ కలయిక జ్ఞాన భవిష్యత్తును మరింత సుసంపన్నం చేస్తుంది’’ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన తాజా మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. దేశంలోని ప్రాచీన జ్ఞాన సంపదను, అభివృద్ధి చెందుతున్న ఆధునిక సాంకేతికతలతో బలోపేతం చేసే ఒక విజనరీ స్టెప్గా ప్రధాని మోదీ దీనిని అభివర్ణించారు. సాంప్రదాయం, సాంకేతికతల ఈ అద్భుత కలయికను అభినందిస్తూ కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ఇక, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కూడా ఈ పరిణామంపై స్పందించారు. సాంకేతికతను భారతదేశ సాంప్రదాయ జ్ఞాన వ్యవస్థతో అనుసంధానించే దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం దేశంలోని ప్రాచీన గ్రంథాలు, తాళపత్రాల డిజిటల్ పరిరక్షణకు కొత్త ఊపునిస్తుందని ఆమె తెలిపారు.