జనం న్యూస్ : కేంద్ర మైనారిటీ వ్యవహారాలు, మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమల శాఖల సహాయ మంత్రిగా పనిచేసిన జార్జి కురియన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.కురియన్ రాజ్యసభ సభ్యత్వ పదవీకాలం ముగియడంతో తన పదవికి రాజీనామా చేశారు. కురియన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ప్రధాని నరేంద్రమోడీ కేంద్ర కేబినెట్ విస్తరణపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా కేంద్ర కేబినెట్ ప్రక్షాళన అంటూ ప్రచారం జరుగుతుంది. ప్రస్తుత కేబినెట్లో కొందరికి ఉద్వాసన తప్పదు అని కూడా ప్రచారం జోరుగా సాగుతుంది. మోడీ కేబినెట్లో పలువురిని తొలగించి కేంద్ర కేబినెట్లోకి కొత్త ఎంపీలకు చోటు కల్పించాలనే యోచనలో మోడీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వడపోతలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇద్దరు కేంద్రమంత్రుల రాజ్యసభ పదవీకాలం ముగిసినప్పటికీ వారిని తిరిగి నామినేట్ చేయలేదు. దీంతో వారికి కేంద్ర కేబినెట్ నుంచి ఉద్వాసన తప్పదని తేలిపోయింది. ఇలాంటి తరుణంలో కేంద్రమంత్రి పదవికి జార్జ్ కురియన్ రాజీనామా చేశారు. కురియన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా వెంటనే ఆమోదించారు.ఈ విషయాన్ని మంగళవారం రాష్ట్రపతి భవన్ ధృవీకరించింది.
కేంద్రమంత్రి పదవికి కురియన్ రాజీనామా
కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి జార్జ్ కురియన్ తన పదవికి రాజీనామా చేశారు. జార్జ్ కురియన్ రాజ్యసభ పదవీకాలం ఇటీవలే ముగిసింది. అయితే ఆయనను తిరిగి రాజ్యసభకు పంపేందుకు అధిష్టానం విముఖత చూపించింది. దీంతో జార్జ్ కురియన్ కేంద్రమంత్రి పదవిని వదులుకోవాల్సి వచ్చింది. ప్రధాని నరేంద్రమోడీ కేబినెట్లో ఉన్న ఏకైక క్రైస్తవ వర్గానికి చెందిన మంత్రి జార్జ్ కురియన్ మాత్రమే. మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా…మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖకు కూడా సహాయ మంత్రిగా జార్జ్ కురియన్ పనిచేస్తున్నారు. ఈనెల 21తో కురియన్ రాజ్యసభ పదవీకాలం ముగిసింది. దీంతో ఆయనకు మళ్లీ రాజ్యసభ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన సూచన మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జార్జ్ కురియన్ రాజీనామాను ఆమోదించారు. కురియన్ రాజకీయ ప్రస్థానం కేరళలోని కొట్టాయం జిల్లాకు చెందిన కురియన్ సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేశారు. అనంతరం 1980 నుంచి భారతీయ జనతా పార్టీలో (BJP) కొనసాగుతున్నారు. గతంలో జాతీయ మైనారిటీల కమిషన్ ఉపాధ్యక్షుడిగా కూడా సేవలందించారు. జార్జ్ కురియన్ 2024లో జరిగిన ఉప ఎన్నికల ద్వారా మధ్యప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2024 జూన్లో మోడీ ప్రభుత్వ మూడవ దఫాలో కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.అయితే కురియన్ రాజ్యసభ పదవీకాలం జూన్ 21తో ముగిసింది. దీంతో ఆయన రాజీనామా చేయక తప్పలేదు.