తెలంగాణ తదుపరి సీఎస్‌గా సంజయ్ జాజు? కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్..

*ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఇదే

జనం న్యూస్ : తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియమితలు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సంజయ్ జాజు నియామకానికి దాదాపు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుత సీఎస్ కె రామకృష్ణా రావు పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు నియమితులు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్ర సర్వీసుల నుంచి సీనియర్‌ ఐఏఎస్ అధికారి సంజయ్‌ జాజు రిలీవ్‌ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర సర్వీసుల నుంచి తెలంగాణకు పంపుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. తదుపరి తెలంగాణ సీఎస్‌గా సంజయ్‌ జాజు నియమితులు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.ప్రస్తుత సీఎస్ కే రామకృష్ణారావు పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్ ఎంపికపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇలాంటి తరుణంలో కేంద్ర సర్వీసుల్లో ఉన్న తెలంగాణ క్యాడర్‌కు చెందిన సంజయ్ జాజును తిరిగి మాతృరాష్ట్ర కేడర్‌కు పంపడంతో నెక్స్ట్ సీఎస్ సంజయ్ జాజు అని తెలుస్తోంది. తెలంగాణ నూతన సీఎస్‌గా సంజయ్ జాజు తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుత సీఎస్ కే రామకృష్ణారావు పదవీ కాలం జూన్ నెలాఖరులో ముగియనుంది. అయితే కొత్త సీఎస్‌ ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి పేర్లు తెరపైకి రాకపోవడంతో తదుపరి సీఎస్ ఎవరా అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి తరుణంలో కేంద్ర సర్వీసుల నుంచి తెలంగాణ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజూ రిలీవ్ కావడంతో తదుపరి సీఎస్ ఆయనేనని ప్రచారం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంజయ్ జాజూపై మెుగ్గు చూపడంతోనే అతడిని కేంద్ర సర్వీసుల నుంచి స్వరాష్ట్రానికి రప్పించుకుటున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి తదుపరి సీఎస్‌గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అత్యంత నమ్మకస్తుడిగా, ఐటీ, పురపాలక శాఖల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న జయేష్ రంజన్ పేరు బలంగా వినిపించింది. అయితే అనూహ్యంగా సంజయ్ జాజు వైపే సీఎం రేవంత్ రెడ్డి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సంజయ్ జాజు తెలంగాణ క్యాడర్‌కు రిలీవ్ అయినట్లు తెలుస్తోంది.

.

1992వ బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి

ఇకపోతే సంజయ్ జాజు తెలంగాణ క్యాడర్‌ 1992 బ్యాచ్‌కు చెందిన అత్యంత సీనియర్ ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేంద్ర సర్వీసుల్లో కీలకమైన శాఖల్లో పని చేశారు.సంజయ్ జాజు పట్టణ, మౌలిక సదుపాయాలు, పౌర సరఫరాలు, విద్య మరియు గిరిజన సంక్షేమం వంటి విభిన్న రంగాలలో పనిచేశారు. అభివృద్ధి మరియు పరిపాలన కోసం సమాచార సాంకేతికతకు బలమైన సమర్థకుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం జాతీయ రహదారుల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా 2014 నుంచి 2018 వరకు పనిచేశారు. . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సమాచార సాంకేతిక మరియు ప్రసార శాఖకు కార్యదర్శిగా పనిచేశారు. ‘మీసేవ’ (2011) అనే ఒక సమగ్ర ప్రధాన కార్యక్రమాన్ని సంజయ్ జాజు రూపొందించి విజయవంతంగా అమలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పౌర సేవల పంపిణీలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. 2018 నుంచి 2023 వరకు జాజు భారత ప్రభుత్వ అదనపు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ క్యాడర్‌కు రిలీవ్ ప్రస్తుతం సంజయ్ జాజు కేంద్ర సర్వీసుల్లో ‘మినిస్ట్రీ ఆఫ్ డెవలప్‌మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్’ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు తక్షణమే పేరెంట్ కేడర్‌కు బదిలీ చేస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ (DoPT) డైరెక్టర్ అన్నీస్ కన్మణి జాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తెలంగాణ కొత్త సీఎస్‌గా 1992 బ్యాచ్‌కు చెందిన సంజయ్ జాజు పేరు దాదాపుగా ఖరారైనట్లుగా సచివాలయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. రాబోయే ఒకటి రెండు రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం నుంచి కొత్త సీఎస్ నియామకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *