జనం న్యూస్ : 8.6 లక్షల మెట్రిక్ టన్నుల ముడిచమురుతో భారత దేశానికి చెందిన మూడు నౌకలు హర్మూజ్ జల సంధిని దాటాయి. అమెరికా-ఇరాన్ ఒప్పందం తర్వాత సడలిన ఆంక్షలతో నౌకల రాకపోకలు మెుదలయ్యాయి. ఈ మూడు నౌకలు జూన్ 24 నుంచి జూలై 1 మధ్యలో భారత్లోని పలు పోర్టులకు చేరుకోనున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. హర్మూజ్ జలసంధి తెరుచుకోనుంది. అమెరికా-ఇరాన్ ఒప్పందం తర్వాత ఆంక్షలు సడలించడంతో నౌకల రాకపోకలు ప్రారంభం అయ్యాయని తెలుస్తోంది. ఈ జలమార్గంలో రవాణా తిరిగి ప్రారంభం కావడం భారత్కు శుభపరిణామం అని చెప్పుకొచ్చవచ్చు. హర్మూజ్ జల సంధి వద్ధ ఆంక్షలు సడలించడం భారత్కు పెద్ద అసెట్గా మారింది. భారత సముద్ర వాణిజ్యానికి, ఇంధన భద్రతకు పెద్ద ఊరట లభించింది. మూడు భారతీయ జెండా కలిగిన భారీ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు విజయవంతంగా హర్మూజ్ జలసంధిని దాటాయి. 8.6 లక్షల మెట్రిక్ టన్నుల ముడిచమురుతో ఈ నౌకలు ప్రస్తుతం భారత ఓడరేవుల వైపు ప్రయాణిస్తున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ 'ఎక్స్' (ట్విట్టర్) ద్వారా ప్రకటించారు.
హర్మూజ్ జలసంధిని దాటిన నౌకలు
'దేశ్ వైభవ్', 'దేశ్ విభోర్', 'సన్మార్ హెరాల్డ్' అనే మూడు నౌకలు 94 మంది భారత సిబ్బందితో హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటినట్లు కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాత్మక నాయకత్వంలో భారత ప్రభుత్వం దేశ సముద్ర ప్రయోజనాల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మన నావికుల భద్రత, దేశ ఇంధన సరఫరా మార్గాల పరిరక్షణ కోసం మా మంత్రిత్వ శాఖ అన్ని సంబంధిత ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తోంది అనికేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ 'ఎక్స్' (ట్విట్టర్)లో పేర్కొన్నారు.
.
జూన్ 24 నుంచి జూలై 1 మధ్య భారత్ చేరుకోనున్న నౌకలు
మరోవైపు ఈ దేశ్ వైభవ్, దేశ్ విభోర్, సన్మార్ హెరాల్డ్ పేర్లత పిలవబడే ఈ మూడు నౌకలు జూన్ 24 నుంచి జూలై 1 మధ్య భారత్ తీరానికి చేరుకోనున్నట్లు అధికార వర్గాల నుంచి సమాచారం.'దేశ్ వైభవ్' జూన్ 24న గుజరాత్లోని వాడినార్ పోర్టుకు చేరే అవకాశం ఉంది అని ప్రకటించారు. అలాగే 'దేశ్ విభోర్' అదే రోజున సిక్కా పోర్టుకు చేరుకునే అవకాశం ఉంది అని సమాచారం. ఇక జూన్ 20న హర్మూజ్ జలసంధిని దాటిన 'సన్మార్ హెరాల్డ్' నౌక జులై 1న ఒడిశాలోని పారాదీప్ పోర్టుకు చేరుకోనుంది అని అధికార వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
జూన్ 18న ఒప్పందంపై సంతకం చేసిన ట్రంప్
భారత్కు ముడు చమురుతో మూడు నౌకలు రావడం వెనుక అంతర్జాతీయ దౌత్యపరమైన సంబంధాలే కారణంగా తెలుస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో అమెరికా, ఇరాన్ మధ్య ఇటీవల ఒక ఒప్పందం కుదిరింది. జూన్ 18న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందంపై సంతకం చేసిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఇరాన్ తన వద్ద ఉన్న అత్యధిక శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తగ్గించుకుంటే ప్రతిగా అమెరికా కొన్ని ఆంక్షలను సడలిస్తుంది అని ట్రంప్ పేర్కొన్నారు.ఈ ఒప్పందం తర్వాత అదే రోజున హార్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలపై ఉన్న ఆంక్షలను అమెరికా ఎత్తివేసింది. దీంతో నెలల తరబడి స్తంభించిన ఈ మార్గంలో చమురు ట్యాంకర్ల రాకపోకలు తిరిగి ప్రారంభం అయ్యాయి. దేశీయ ఇంధన అవసరాల కోసం అధికంగా ముడి చమురు దిగుమతులపైనే ఆధారపడి ఉన్న భారత్కు, సముద్ర మార్గాల్లో రవాణా నిరంతరాయంగా సాగడం అత్యంత ముఖ్యం. ఈ నౌకలు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరడం అనేది ఒకవైపు అంతర్జాతీయ దౌత్య విజయాన్ని, మరోవైపు భారత ప్రభుత్వం తన ఇంధన భద్రతకు, సముద్ర ప్రయోజనాలకు ఇస్తున్న ప్రాధాన్యతను సూచిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.