
జనం న్యూస్ : ఆధునిక యుద్ధ తంత్రాలకు అనుగుణంగా మారేందుకు భారత సైన్యం చేపడుతున్న మోడర్నైజేషన్ ప్రయత్నాల గురించి పదవీ విరమణ చేయనున్న భారత ఆర్మీ చీఫ్ (COAS) జనరల్ ఉపేంద్ర ద్వివేది టైమ్స్నౌ తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో వివరించారు.ఆధునిక యుద్ధ తంత్రం, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భారత సైన్యం ఎలా సన్నద్దమవుతుంది? అనే అంశంపై బాధ్యతల నుంచి తప్పుకోనున్న ఆర్మీ చీఫ్ (COAS) జనరల్ ఉపేంద్ర ద్వివేది టైమ్స్నౌ తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో వివరించారు. భారత సైన్యాన్ని ఆధునీకరించే విషయంలో కేవలం ఆయుధాలు కొనుగోలు చేయడం మాత్రమే కాకుండా, బలగాల్లో మార్పులు చేయడం, అడ్వాన్స్ టెక్నాలజీని అనుసంధానం చేయడం, భవిష్యత్తులో జరగబోయే సంఘర్షణల కోసం కార్యాచరణ సంసిద్దతను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తుందని ఆయన తెలిపారు. మారుతున్న యుద్దం తీరుకు అనుగుణంగా భారత సైన్యం ఎలా మార్చుకుంటుందనే విషయంపై మాట్లాడిన ఆయన " యుద్దం స్వరూపం వేగంగా మారిపోతుంది. భారత సైన్యం దానికి అనుగుణంగా మార్పులు చేసుకుంటుంది. ఆధునికీకరణ అనేది నిర్మాణాలు, శిక్షణ, సాంకేతికత, సిద్ధాంతం, వ్యవస్థలు, హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్తో కూడిన ఒక పెద్ద ప్రాసెస్గా పరిగణించబడుతుందని అన్నారు. భవిష్యత్తు కార్యకలాపాల విషయంలో వేగమైన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు, నిఘా, పర్యవేక్షణ, ఆయుధాలు, కమ్యూనికేషన్ నెట్వర్క్స్, కమాండర్స్ మధ్య మరింత సమన్వయం ఎంతో అవసరమని తెలిపారు. ఈ మేరకు భారత సైన్యం మరింత చురుకైన, నెట్వర్క్తో లింక్ చేయబడిన , టెక్నాలజీ-ఎనేబుల్డ్ ఫార్మేషన్స్ దిశగా మారుతోందని అన్నారు. రుద్ర బ్రిగేడ్స్, బైరవ్ బెటాలియన్స్, అష్ని డ్రోన్ ప్లాటూన్స్, శక్తిబాన్ రెజిమెంట్స్, దివ్యాస్త్ర బ్యాటరీస్ వంటి కొత్త నిర్మాణాలు ఈ పరివర్తనలో భాగమని, వీటి ద్వారా వేగం, కచ్చితత్వం, యుద్ధరంగంపై అవగాహన, రెస్పాన్స్ను మెరుగుపర్చాలని అన్నారు.ఆపరేషన్ సింధూర్ గురించి ఏ చెప్పారంటే.... ఉద్భవిస్తున్న సెక్యూరిటీ ఛాలెంజెస్ విషయంలో ప్రతిస్పందించే భారత సైన్యం సామర్థ్యం గురించి ఆపరేషన్ సింధూర్ ఏం వెల్లడించిందనే విషయంపై కూడా జనరల్ ఉపేంద్ర ద్వివేదీ మాట్లాడారు. భవిష్యత్తులో జరగబోయే యుద్ధాల్లో సాంకేతికత, నిఘాతో పాటు కోఆర్డినేటెడ్ ప్లానింగ్ యొక్క ప్రాముఖ్యతను గురించి చెబుతూ, ఆపరేషన్ సింధూర్ను భారతదేశ సైనిక సామర్థ్య ప్రదర్శనగా పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ గురించి నేర్చుకోవాల్సిన విషయాలపై మాట్లాడుతూ.... ఆపరేషన్ సింధూర్ భారతదేశ సంకల్పాన్ని, సామర్థ్యాన్ని, సంయమనాన్ని ప్రదర్శించిందని జనరల్ ద్వివేది అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత సైన్యం కచ్చితత్వంతో, స్పష్టమైన లక్ష్యంతో, క్రమ బద్దమైన ప్రణాళికతో చేపట్టిన వ్యూహాత్మకమైన సైనిక చర్యగా ఆపరేషన్ సింధూర్ను పేర్కొన్నారు. భారత సైన్యానికి ఈ ఆపరేషన్ ద్వారా క్రెడిబుల్ ఇంటెలిజెన్స్, జాయింట్ ప్లానింగ్, సెక్యూర్ కమ్యూనికేషన్, కచ్చితమైన ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ ప్రాముఖ్యతను తెలిపిందని అన్నారు. ప్రస్తుత పరిస్థితులలో యుద్దంలో కేవలం బలప్రయోగం మాత్రమే ముఖ్యం కాదని, వేగం, సమన్వయం, స్పష్టత, నియంత్రణ కూడా ఎంతో ముఖ్యమని నిరూపించిందని తెలిపారు.