భద్రాద్రి ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం

సాక్షి డిజిటల్ న్యూస్: భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆగమశాస్త్ర నియమాలను కచ్చితంగా పాటిస్తూ ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.భద్రాచలం ఆలయ వైభవం, ఆధ్యాత్మికతకు ఎటువంటి భంగం కలగకుండా, సంప్రదాయ శిల్పకళను ప్రతిబింబించేలా రాతి నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, దక్షిణ అయోధ్యగా ఖ్యాతి గాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు ఈ నెల 27వ తేదీన శ్రీకారం చుడుతున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు.భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆగమశాస్త్ర నియమాలను కచ్చితంగా పాటిస్తూ ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని స్పష్టం చేశారు.భద్రాచలం ఆలయ వైభవం, ఆధ్యాత్మికతకు ఎటువంటి భంగం కలగకుండా, సంప్రదాయ శిల్పకళను ప్రతిబింబించేలా రాతి నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. రాబోయే రెండు వందల ఏళ్లకు తగ్గట్లుగా ఆలయ అభివృద్ధి రాబోయే రెండు వందల సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్ తరాలకు కూడా ఆదర్శంగా నిలిచే విధంగా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఈ నెల 27వ తేదీన ఆలయ పునరుద్ధరణ పనులను అధికారికంగా ప్రారంభించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోనే పనులు పూర్తయ్యేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆలయ పునరుద్దరణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.351 కోట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. వచ్చే శ్రీరామ నవమి నాటికి నిర్దేశించిన పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయడానికి ముందస్తుగానే పనుల విభజన చేసుకొని సమాంతరంగా అన్ని పనులు చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. పుష్కరాలకు మెుదటి విడత పనులు పూర్తి చేస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో డిప్యూటీ సీఎం, స్థానిక మంత్రి సహకారంతో స్థానికంగా అవసరమైన భూ సేకరణ చేసిన తర్వాత, రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాలు జరుగుతున్న నేపథ్యంలో మొదటి విడత క్రింద భద్రాచలం ఆలయానికి 351 కోట్ల రూపాయలతో చేపట్టే అభివృద్ధి పనులకు ఈ ఏడాది శ్రీ సీతారామ చంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అనంతరం పనులకు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే.వ‌చ్చే ఏడాది గోదావరి పుష్క‌రాలు ప్రారంభ‌మ‌య్యేనాటికి భ‌ద్రాచ‌లంలో పుష్క‌ర ఘాట్‌తో పాటు మొద‌టి ద‌శ ఆల‌య అభివృద్ది ప‌నులు పూర్త‌య్యేలా ప్ర‌ణాళికలు సిద్ధం చేయాల‌ని అధికారుల‌ను ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. భద్రాచలాన్ని తెలంగాణలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక హబ్‌గా మారుస్తామని... భ‌ద్రాచ‌లం స‌మీపంలోని రామ‌వ‌రంలో ట్రైబ‌ల్ మ్యూజియం ఏర్పాటు చేయాల‌ని ప్రభుత్వం నిర్ణయించింది. గోదావ‌రి పుష్క‌రాల‌లో భాగంగా అత్యంత ప్రాధాన్య‌త క‌లిగిన కొరివి వీర‌భ‌ద్ర‌స్వామి దేవాల‌యం, మల్లూరులోని న‌రసింహాస్వామి దేవాల‌యాల‌ను కూడా అభివృద్ది చేయాల‌ని సూచించారు. తర్వాత రెండవ విడత నిధులు విడుదల చేసుకొని కృష్ణ పుష్కరాల నాటికి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది.కుంభమేళా తరహాలో గోదావరిపుష్కరాలు పన్నెండేళ్లకు ఒకసారి అత్యంత పవిత్రంగా జరుపుకునే గోదావరి పుష్కరాలు తెలంగాణ రాష్ట్రంలో 2027 జూన్ 26 నుండి జూలై 7 వరకు జరగనున్నాయి. ఈ పవిత్ర దినాల్లో సుమారు 8 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా 'కుంభమేళా' తరహాలో ఈ పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ పుష్కరాల నిర్వహణ మరియు రోడ్ల విస్తరణ, కొత్త ఘాట్ల నిర్మాణం, దేవాలయాల అభివృద్ధి వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి ఏర్పాట్లను పర్యవేక్షించడానికి మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో ఒక ప్రత్యేక క్యాబినెట్ సబ్-కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, భద్రత, రద్దీ నియంత్రణ కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించే చర్యలు తీసుకుంటోంది. ఈ గోదావరి పుష్కరాల నిర్వహణ కొరకు ఈ బడ్జెట్ లో 500 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఆధ్యాత్మికపర్యాటకఅభివృద్ధి రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని అభివృద్ధి చేయడంతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. రాష్ట్ర దేవాదాయశాఖ తెలంగాణ పర్యాటక అభివృద్ధిసంస్థతో కలిసిరాష్ట్రంలో తొమ్మిది కొత్తపవిత్ర యాత్రాసర్క్యూట్లను ప్రారంభించింది. ఈయాత్రా సర్క్యూట్ల ద్వారా భక్తులకు వసతి సదుపాయాలు, ప్రత్యేకదర్శనం, పర్యాటక సౌకర్యాలు అందించబడుతున్నాయి.