
సాక్షి డిజిటల్ న్యూస్: బండి సాయి భగీరథ్కు తాత్కాలిక బెయిల్ మంజూరు అయింది. బండి భగీరథ్కు మల్కాజ్గిరి కోర్టు వారం రోజుల పాటు బెయిల్ మంజూరు చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి... బండి సాయి భగీరథ్కు తాత్కాలిక బెయిల్ మంజూరు అయింది. బండి భగీరథ్కు మల్కాజ్గిరిలోని పోక్సో కోర్టు వారం రోజుల పాటు బెయిల్ మంజూరు చేసింది. పోక్సో కేసులో బండి భగీరథ్ను పోలీసులు మే 16వ తేదీన అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కోర్టు రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు. ఆ తర్వాత కోర్టు అనుమతితో బండి భగీరథ్ను కస్టడీకి తీసుకున్న పేట్బషీరాబాద్ పోలీసులు డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు విచారించారు. అనంతరం తిరిగి బండి భగీరథ్ చర్లపల్లి జైలుకు తరలించారు. ప్రస్తుతం బండి భగీరథ్ అక్కడే ఉన్నారు. అయితే ఈ కేసులో బెయిల్ కోసం బండి భగీరథ్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తాను పరీక్షలు రాసేందుకు వీలుగా కోర్టు అనుమతి కోరారు. ఈ క్రమంలోనే మల్కాజిగిరి పోక్సో కోర్టు ఏడు రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బండి భగీరథ్ తన చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేందుకు వీలుగా మాత్రమే ఈ మధ్యంతర బెయిల్ మంజూరు చేయబడింది. కోర్టు మంజూరు చేసిన ఈ బెయిల్... షరతులకు లోబడి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.ప్రస్తుతం బెయిల్ మంజూరు కావడంతో వారం రోజుల పాటు జైలు నుంచి బండి భగీరథ్ బయటకు రానున్నారు. ఇక, ఓ బాలిక (17) కుటుంబం హైదరాబాద్ పేట్బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించి బండి భగీరథ్పై ఫిర్యాదు చేసింది. తమ కుమార్తెను భగీరథ్ వేధిస్తున్నారని ఆరోపించింది. పేట్బషీరాబాద్ పోలీసులు పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద బండి భగీరథ్పై కేసు నమోదు చేశారు.