
పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణ లో కొత్తగా పురుడుపోసుకున్న ‘తెలంగాణ రక్షణ సేన’ పార్టీకి ఇంకా పురిటినొప్పులు తప్పడం లేదు. కల్వకుంట్ల కవిత స్థాపించిన కొత్త రాజకీయ పార్టీ టీఆర్ఎస్ పేరు మార్పుపై ఈసీ కీలక ఆదేశాలు జార ీచేసింది.'తెలంగాణ రక్షణ సేన' (TRS)పేరు మార్చుకోవాలని సూచించింది. రాబోయే 15 రోజుల్లోగా 3 ప్రత్యామ్నాయ పేర్లను తమకు సమర్పించక పోతే...ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తును పూర్తిగా మూసివేస్తామని ఈసీ గడువు విధించినట్లు తెలుస్తోంది. కల్వకుంట్ల కవితకు బిగ్షాక్ తగిలింది. కల్వకుంట్ల కవిత స్థాపించిన ‘తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్)’పార్టీకి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. కవిత కొత్త పార్టీ పేరును మార్చాలంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది.తెలంగాణ రక్షణ సేన పేరుపై ప్రజల నుంచి అనేక అభ్యంతరాలు వస్తున్నాయని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. 15 రోజుల్లో మూడు ప్రత్యామ్నాయ పేర్లు సమర్పించాలని కవితను సూచించింది. ప్రత్యామ్నాయంగా మూడు పేర్లు ఇవ్వకపోతే దరఖాస్తు మూసి వేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కవితకు లేఖ రాసింది.అయితే ఈసీకీ కల్వకుంట్ల కవిత సైతం లేఖ రాసినట్లు తెలుస్తోంది.
కవితకు ఈసీ లేఖ
కవిత కొత్త పార్టీ పేరును మార్చాలంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రక్షణ సేన పేరుపై ప్రజల నుంచి అభ్యంతరాలు ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. పదిహేను రోజుల్లో మూడు ప్రత్యామ్నాయ పేర్లు సమర్పించాలని ఆదేశించింది. ఇకపోతే కేసీఆర్ నేతృత్వంలోని 'తెలంగాణ రాష్ట్ర సమితి' పార్టీ కూడా ‘టీఆర్ఎస్’ పార్టీగా పిలవబడింది.తెలంగాణ ప్రజలతోపాటు యావత్ దేశవ్యాప్తంగా టీఆర్ఎస్ పేరు మార్మోగిపోయింది. అనంతరం టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రసమితి పార్టీని భారత్ రాష్ట్ర సమితి (BRS) పార్టీగా మార్చింది.అనంతరం జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయింది. అయితే బీఆర్ఎస్లో తెలంగాణ పేరు లేదనిజ...తెలంగాణ సెంటిమెంట్ ఇసుమంతైనా కనిపించడం లేదనే వాదనలు వినిపించాయి. ఇలాంటి తరుణంలో కవిత కొత్త పార్టీ పెట్టారు. టీఆర్ఎస్ షార్ట్ కట్ పేరు వచ్చేలా 'తెలంగాణ రక్షణ సేన'పార్టీని స్థాపించారు. అయితే ఈ పేరుపై పలువురు ప్రజల నుంచి వివిధ వర్గాల నుండి ఎన్నికల సంఘానికి పెద్ద ఎత్తున అభ్యంతరాలు, ఫిర్యాదులు వచ్చాయి. పాత పార్టీ పేరును, సెంటిమెంట్ను తలపించేలా ఈ కొత్త పేరు ఉండటం వల్ల ఓటర్లలో తీవ్ర గందరగోళం నెలకొనే అవకాశం ఉందని ఈసీ అభిప్రాయపడింది. దీంతో ఆ పేరును కొనసాగించడం కుదరదని స్పష్టం చేసింది. కవితకు పంపిన లేఖలో ఈసీ ఈ విషయాలను పొందుపరిచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అవసరమైతే న్యాయపోరాటం చేస్తాం: కవిత
మరోవైపు ఎన్నికల సంఘం లేఖపై టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. పేరు మార్చేది లేదని…ఇప్పటికే ఈసీ అభ్యంతరాలపై వివరణ ఇస్తూ రెండు లేఖలు రాసినట్లు చెప్పుకొచ్చారు. అయినప్పటికీ పేరు మార్చాలని సూచించడం సరికాదని… ఈసీ నిర్ణయంపై తాము న్యాయపోరాటానికి అయిన సిద్ధం అని కవిత ప్రకటించారు.