
అక్షర ఆయుధం : తెలంగాణలోని వర్సిటీల్లో కాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్ఏయూ), కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం (ఎస్కేఎల్టీఎస్హెచ్యూ), పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం (పీవీఎన్ఆర్టీవీయూ)లలో ఖాళీగా ఉన్న 984 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. రాష్ట్రంలోని 3 ప్రతిష్టాత్మక వ్యవసాయ అనుబంధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 984 అధ్యాపక, ఇతర పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీ విషయంలో కీలక సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు ఉన్న ఇంటర్వ్యూ విధానాన్ని పూర్తిగా రద్దు చేసింది. ఈ మేరకు ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇకపై కేవలం రాతపరీక్షలో సాధించిన మార్కులు...అకడమిక్ మెరిట్ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేయాలని ప్రభుత్వం ఇటీవలే స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ ఇంటర్వ్యూ లేకుండానే జరగనుంది. 3 వర్సిటీల్లో 984 పోస్టుల భర్తీతెలంగాణలోని 3 ప్రముఖ యూనివర్సిటీలలో ఖాళీల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్ఏయూ), కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం (ఎస్కేఎల్టీఎస్హెచ్యూ), పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం (పీవీఎన్ఆర్టీవీయూ)లలో ఖాళీగా ఉన్న 984 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ పోస్టుల భర్తీ ప్రక్రియలో పారదర్శకతను పెంచడం, ఎలాంటి అవినీతి, సిఫార్సులకు తావులేకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. ఇప్పటికే గ్రూప్-1 వంటి ఉన్నతస్థాయి ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూలను ప్రభుత్వం రద్దు చేసింది.అదే విధానాన్ని విశ్వవిద్యాలయాల నియామకాల్లోనూ అమలు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.భర్తీ కానున్న పోస్టుల వివరాలు ఇవేమరోవైపు మూడు వర్సిటీల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్,అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఖాళీల వివరాలను ప్రభుత్వం విడుదల చేసింది.ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం తమ పరిధిలో 550 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.కేవలం రాతపరీక్ష మార్కుల ఆధారంగానే ఈ పోస్టులను భర్తీ చేసేందుకు త్వరలోనే కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని వర్సిటీ వైస్ ఛాన్సలర్ జానయ్య వెల్లడించారు. ఎస్కేఎల్టీఎస్హెచ్యూలో 140 పోస్టుల భర్తీమరోవైపు కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఇప్పటికే 140 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 79 అసిస్టెంట్ ప్రొఫెసర్, 44 అసోసియేట్ ప్రొఫెసర్, 17 ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు అన్నీ ఇంటర్వ్యూలను మినహాయించాలని ప్రభుత్వం ఉత్తర్వులు పేర్కొంది. ఇక పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలో బ్యాక్లాగ్, కొత్త ఖాళీలతో కలిపి మొత్తం 294 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు కూడా ఇంటర్వ్యూ లేకుండానే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అభ్యర్థులు, విద్యావేత్తల హర్షంఇదిలా ఉంటే 984 పోస్టుల భర్తీకి సంబంధించి ఇంటర్వ్యూను లేకుండా చేయడం పట్ల నిరుద్యోగ అభ్యర్థుల నుంచి సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇంటర్వ్యూల పేరుతో జరిగే అవకతవకలకు, సిఫార్సులకు చెక్ పడుతుందని అభిప్రాయపడుతున్నారు.ఈ పోస్టుల భర్తీ కేవలం ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు లభించే అవకాశం కలగడం వల్ల గ్రామీణ, పేద నేపథ్యం ఉన్న అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని విద్యావేత్తలు వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ పోస్టుల భర్తీకి సంబంధించి సంబంధిత విశ్వవిద్యాలయాల బోర్డులు త్వరలోనే ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి సిలబస్, పరీక్షల షెడ్యూల్ను విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.