అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం

అక్షర ఆయుధం : ఏపీ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అరణ్యారామం భవన ప్రాంగణానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భూమి పూజల చేశారు. ఈ అరణ్యారామం భవనం హనుమాన్ కార్యకలాపాలకు కమాండ్ సెంటర్‌గా... ఏపీగ్రేట్ గ్రీన్ వాల్ కార్యక్రమానికి పర్యవేక్షణ కేంద్రంగా, పులుల సంరక్షణ, అటవీ అగ్నిప్రమాదాల నివారణ, జీవావరణ పునరుద్ధరణ, వాతావరణ స్థిరత్వం, ఎకో-టూరిజం అభివృద్ధి, డిజిటల్ పర్యావరణ పరిపాలన తదితర విభాగాలకు సమన్వయ కేంద్రంగా సేవలు అందించనుంది అరణ్యారామం భవన ప్రాంగణానికి ఏపీ డిప్యూటీ సీఎం,రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ భూమి పూజ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖల పరిశోధన, శిక్షణ కార్యక్రమాల పర్యవేక్షణకు ఈ భవనం కేంద్రంగా ఉండనుంది అని తెలిపారు. మంగళగిరిలోని ఎయిమ్స్ సమీపంలో బ్రహ్మానందపురం వద్ద ఈ భవన ప్రాంగణాన్ని రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్,కందుల దుర్గేష్, అటవీ శాఖ ఉన్నతాధికారులతో కలసి పవన్ కళ్యాణ్ నూతన భవన ప్రాంగణానికి భూమి పూజ చేశారు. సూమారు రూ.24 కోట్ల అంచనా వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. ఈ అరణ్యారామం అటవీ, పర్యావరణ శాఖలకు సంబంధించి పరిశోధనలు, శిక్షణా కార్యక్రలాపాలతోపాటు ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలన్నింటినీ ఒకే వేదిక నుంచి సమన్వయం చేసే కామన్ ఫెసిలిటీ సెంటర్‌గా సేవలు అందించనుంది. రాష్ట్ర అటవీ పరిశోధన, శిక్షణ కార్యక్రమాలకు అరణ్యారామం వేదిక కానుంది. హనుమాన్ కార్యకలాపాలకు కమాండ్ సెంటర్‌గా అరణ్యారామం అరణ్యారామం భవనం H.A.N.U.M.A.N. కార్యకలాపాలకు కమాండ్ సెంటర్‌గా...ఆంధ్రప్రదేశ్ గ్రేట్ గ్రీన్ వాల్ కార్యక్రమానికి పర్యవేక్షణ కేంద్రంగా... పులుల సంరక్షణ, అటవీ అగ్నిప్రమాదాల నివారణ, జీవావరణ పునరుద్ధరణ, వాతావరణ స్థిరత్వం, ఎకో-టూరిజం అభివృద్ధి, డిజిటల్ పర్యావరణ పరిపాలన తదితర విభాగాలకు సమన్వయ కేంద్రంగా సేవలు అందించనుంది అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ‘అధునాతన సాంకేతికత సాయంతో ప్రకృతి పరిరక్షణ ధ్యేయంగా అరణ్యారామంలో శాస్త్రీయ పరిశోధనలు జరపనున్నారు. క్షేత్ర స్థాయిలో అమలు చేసే కార్యకలాపాలన్నింటినీ ఒకే చోటు నుంచి పర్యవేక్షించే పరిపాలనా కేంద్రంగా నిలవనుంది’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. హనుమాన్ గ్యాలరీల పరిశీలన భూమి పూజ అనంతరం అరణ్యారామం భవన నమూనా, నిర్మిస్తున్న ప్రదేశానికి సంబంధించిన వివరాలను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. మానవ, వన్యప్రాణి ఘర్షణలను నిలువరించేందుకు తీసుకువచ్చిన H.A.N.U.M.A.N ఫౌండేషన్ ద్వారా రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్స్ వివరాలతో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు. ఒక్క 2024 ఏడాదిలోనే ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ 185 వన్యప్రాణి రక్షణ చర్యలు చేపట్టినట్టు అధికారులు ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలియజేశారు. మరో 36 మానవ, వన్యప్రాణి సంఘర్షణ నివారణ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసినట్టు తెలిపారు. నిబద్దతతో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభినందించారు.ఇకపోతే ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్ దండే, అటవీశాఖ సలహాదారు మల్లికార్జునరావు, అటవీ శాఖ పీసీసీఎఫ్ పి వి చలపతి రావు, రాష్ట్ర మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, పీసీబీ ఛైర్మన్ డాక్టర్ పి కృష్ణయ్య, బయో డైవర్సిటీ బోర్డ్ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్, అటవీశాఖ ఐటీ సలహాదారు పి.నాగబాబు, APCOST మెంబర్ సెక్రటరీ శరత్, అటవీ శాఖ ఉన్నతాధికారులు రేవతి, రాహుల్ పాండే, గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఎస్పీ వకుళ్ జిందాల్, ఇతర అటవీశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.